క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో?: కొడాలి నాని

ABN , First Publish Date - 2022-01-29T17:34:08+05:30 IST

గుడివాడ క్యాసినో అంశంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..

క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో?: కొడాలి నాని

విజయవాడ : గుడివాడ క్యాసినో అంశంపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారని ఎద్దేవా చేశారు. మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని ప్రశ్నించారు. ఇంకా కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘గుడివాడలో నన్ను ఒడించలేకే  లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదు. వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో? గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-29T17:34:08+05:30 IST