భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటం సమర్పించిన కొడాలి నాని దంపతులు
ABN , First Publish Date - 2021-12-06T17:47:11+05:30 IST
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దంపతులు భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు.
భద్రాచలం: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దంపతులు భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. 13 లక్షల రూపాయల విలువ గల స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. కొడాలి నాని దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.