తండ్రయిన కోహ్లీ.. పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్క

ABN , First Publish Date - 2021-01-11T22:02:28+05:30 IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది.

తండ్రయిన కోహ్లీ.. పండంటి పాపకు జన్మనిచ్చిన అనుష్క

ముంబై: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కోహ్లీ స్వయంగా ట్వీట్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ‘‘మీ ప్రేమ, అభిమానం, ప్రార్థనలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈసారి మా గోప్యతను మీరు గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’’ అని ట్వీట్ చేశాడు.  


అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఆ మధుర క్షణాల్లో పక్కనే ఉండాలని భావించిన కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి పితృత్వ సెలవులపై భారత్ వచ్చాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు మాత్రమే ఆడిన కోహ్లీ ఆ తర్వాత భారత్‌కు వచ్చేసి అనుష్కతోనే ఉంటున్నాడు. కొద్దిసేపటి క్రితం పాప జన్మించడంతో ఆ ఆనందాన్ని వెంటనే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 

Updated Date - 2021-01-11T22:02:28+05:30 IST