శార్దూల్, సుందర్లపై కోహ్లీ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-01-17T20:08:07+05:30 IST
శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో...
ఇంటర్నెట్ డెస్క్: శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో అద్భుత ప్రదర్శన కనపబరచి మ్యాచ్ను నిలబెట్టారని, అద్భుతంగా ఆడారని అభినందించాడు. ఈ మేరకు విరాట్ ఓ ట్వీట్ చేశాడు. అద్భుతమైన ప్రదర్శనతో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లు ఆడారు. ఇది అసలైన టెస్ట్ క్రికెట్ అంటే. వాషింగ్టన్ సుందర్ నీవు తొలి మ్యాచ్లోనే అదరగొట్టావు. ఇక శార్దూల్ నువ్వు మరోసారి నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు’ అంటూ కోహ్లీ తన ట్వీట్లో రాసుకొచ్చాడు.
ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ అంతా విఫలమైనా శార్దూల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62)లు ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టరు. దీంతో భారీ ఆధిక్యం సాధిస్తామనుకున్న ఆసీస్ ఆశలు ఆవిరయ్యాయి. చివరకు 336 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ కావడంతో ఆసీస్కు 33 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 21 పరుగులు చేసింది. వార్నర్(20) దూకుడుగా ఆడుతున్నా.. హ్యారిస్(1) అవతలి ఎండ్లో వికెట్ కాపాడుతూ నిలబడ్డాడు.