అప్పుడు మాట్లాడలేదే?.. పిచ్ విమర్శకులకు కోహ్లీ చురకలు
ABN , First Publish Date - 2021-03-04T10:54:22+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీసులో మూడో మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆటగాళ్ల కన్నా పిచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీసులో మూడో మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఆటగాళ్ల కన్నా పిచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. మొతేరాల పిచ్ మరీ ఘోరంగా ఉందంటూ కొందరు సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ ఈ విషయంపై ప్రతిరోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే వచ్చారు. అయితే ఈ విమర్శకులందరికీ కింగ్ కోహ్లీ చెక్ పెట్టాడు. పేసర్లకు అనుకూలించే సీమింగ్ పిచ్లపై మ్యాచ్ మూడురోజుల్లో ముగిస్తే ఎవరూ మాట్లాడరని, స్పిన్ పిచ్లపైనే విమర్శిస్తారని మండిపడ్డాడు. ‘‘సీమింగ్ ట్రాక్లపై జట్లు 40-45 పరుగులకే చాపచుట్టేసినా ఎవరూ పెదవి విప్పరు. మేమే న్యూజిలాండ్లో మూడు రోజుల్లోనే మ్యాచ్ ఓడిపోయాం. అప్పుడెవరూ పిచ్ గురించి మాట్లాడలేదే’’ అని కోహ్లీ చురకలు వేశాడు.