తమ జట్టు లోగోను చూసి థ్రిల్లయిన కోహ్లీ
ABN , First Publish Date - 2020-02-14T22:31:57+05:30 IST
తన జట్టు ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆవిష్కరించిన నయా లోగో ఆ జట్టు కెప్టెన్
బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆవిష్కరించిన నయా లోగో ఆ జట్టు కెప్టెన్ కోహ్లీకి తెగ నచ్చేసింది. కొత్త లోగో చూసిన అనంతరం తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. లోగో తనను థ్రిల్ చేసినట్టు చెప్పాడు. ఐపీఎల్ 2020 ఎడిషన్కు సన్నద్ధమవుతున్న ఆర్సీబీ అందులో భాగంగా నేడు సరికొత్త లోగోను ఆవిష్కరించింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ ఆర్సీబీ పోస్టు చేసిన కొత్త లోగో వీడియో చూడగానే థ్రిల్లయ్యాడు. చాలా బాగుందని ట్వీట్ చేశాడు. చాలెంజర్స్ స్పిరిట్, గొప్పతనాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నాడు.