కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 196

ABN , First Publish Date - 2020-09-24T03:17:12+05:30 IST

ఐపీఎల్‌ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాభిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 195 స్కోరు చేసింది...

కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గెట్ 196

ఐపీఎల్‌ 2020లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాభిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 195 స్కోరు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు 196 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది.


కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచినా ముంబైకు బ్యాటింగ్ అప్పగించింది. రెండో ఓవర్లోనే క్వింటన్ డి కాక్ ఔటవ్వడంతో తడబడ్డ ముంబై టీంని రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్‌ అద్భుతంగా రాణించి రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఆ తరువాత పదకొండో ఓవర్‌లో సునీల్ నరైన్ వేసిన  అయిదో బంతికి యాదవ్ రనౌట్ అయ్యాడు. యాదవ్ పయనం తరువాత వచ్చిన సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకు కాసేపు తోడుగా నిలిచారు. ఇద్దరూ తక్కువ స్కోరుకే వెనుతిరిగారు. రోహిత్ శర్మ మాత్రం నిలకడగా ఆడుతూ 54 బంతుల్లో 80 పరుగులు(3ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి 18 ఓవర్లో అయిదో బంతికి 177 స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన పోల్లార్డ్  నిలకడగా ఆడుతూ స్కోరుని 195కి చేర్చాడు.

Updated Date - 2020-09-24T03:17:12+05:30 IST