ఐపీఎల్: కోల్కత్తా నైట్రైడర్స్ టార్గెట్ 143
ABN , First Publish Date - 2020-09-27T03:09:26+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరుగుతున్న సన్రైజర్స్ వర్సెస్ నైట్రైడర్స్ మ్యాచ్లో...
అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరుగుతున్న సన్రైజర్స్ వర్సెస్ నైట్రైడర్స్ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్లో మాత్రం ఆ దూకుడును చూపలేకపోయింది. 24 పరుగుల వద్ద కమ్మిన్స్ బౌలింగ్లో ఓపెనర్ బెయిర్ స్టో క్లీన్ బౌల్డ్ కావడంతో ఆరంభంలోనే సన్రైజర్స్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. వార్నర్ 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మనీష్ పాండే 51 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. సాహా 31 బంతుల్లో 30 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. నైట్రైడర్స్ బౌలర్లలో కమ్మిన్స్, వరుణ్ చక్రవర్తి, రస్సెల్కు తలో వికెట్ దక్కింది.