రాబోయే దుర్గా నవరాత్రులలో వినిపించనున్న ప్రణబ్ చండీపాఠం

ABN , First Publish Date - 2020-09-03T17:21:29+05:30 IST

భారత రత్న, మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ గతంలో ప్రతీయేటా దుర్గా నవరాత్రులలో తన స్వగ్రామానికి వచ్చి, నాలుగు రోజుల పాటు పూజలు చేస్తుండేవారు. ఈ సందర్భంగా ప్రణబ్ స్వయంగా చండీపాఠాన్ని చదివేవారు.

రాబోయే దుర్గా నవరాత్రులలో వినిపించనున్న ప్రణబ్ చండీపాఠం

కోల్‌కతా: భారత రత్న, మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ గతంలో ప్రతీయేటా దుర్గా నవరాత్రులలో తన స్వగ్రామానికి వచ్చి, నాలుగు రోజుల పాటు పూజలు చేస్తుండేవారు. ఈ సందర్భంగా ప్రణబ్ స్వయంగా చండీపాఠాన్ని చదివేవారు. దీనిని ఉత్సవ నిర్వాహకులు రికార్డు చేశారు. ఇప్పుడు ఈ రికార్డింగ్‌ను రాబోయే దుర్గా నవరాత్రులలో ఉత్సవాలు జరిగే వేదికల వద్ద వినిపించనున్నారు. ఈ సందర్భంగా  ప్రణబ్ కుటుంబానికి సన్నిహితుడు, దుర్గాపూజల నిర్వాహకులు రవి చట్టోరాజ్ మాట్లాడుతూ తాము దుర్గాపూజా ఉత్సవాల్లో ప్రణబ్ ముఖర్జీ ఆలపించిన చండీపాఠాన్ని వాడవాడలా వినిపించాలనుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-03T17:21:29+05:30 IST