తండ్రిని కర్కశంగా హతమార్చిన కుమార్తె

ABN , First Publish Date - 2021-03-23T22:32:03+05:30 IST

22ఏళ్ల వయసున్న ఓ యువతి తన తండ్రిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది. రాత్రి భోజనానికి బయటికితీసుకెళ్లిన తండ్రికి మద్యం తాగించి నిప్పంటించి కర్కశంగా హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

తండ్రిని కర్కశంగా హతమార్చిన కుమార్తె

కోల్‌కతా: 22ఏళ్ల వయసున్న ఓ యువతి తన తండ్రిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది. రాత్రి భోజనానికి బయటికితీసుకెళ్లిన తండ్రికి మద్యం తాగించి నిప్పంటించి కర్కశంగా హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు ఆదివారం రాత్రి తండ్రిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ అతడికి మద్యం తాగించిన తర్వాత ఇద్దరూ కలిసి స్ట్రాండ్ రోడ్‌లోని చాద్‌పాల్ ఘాట్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరు మాట్లాడుకుంటుండగా మద్యం మత్తులో ఉన్న తండ్రి పక్కనే ఉన్న బల్ల మీద నిద్రపోయాడు. అది గమనించిన కూతురు అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసింది.


ఈ సంఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిస్టోపర్ రోడ్‌లో నివాసముంటున్న యువతిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితురాలిని విచారించిన అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. చిన్నతనంలోనే తన తల్లి మరణించినట్లు చెప్పిందన్నారు. అప్పటి నుంచి ఆమెను తండ్రి శారీరకంగా, మానసికంగా హింసించేవాడని పేర్కొన్నారు. అయితే ఆమెకు పెళ్లయిన తర్వాత హింసించడం ఆపేశాడు. వివాహం విచ్ఛిన్నం అయిన తర్వాత తిరిగి ఇంటికొచ్చిన ఆమెను తండ్రి మళ్లీ హింసించడం మొదలుపెట్టాడు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మార్చి 29 వరకు కస్టడీ విధించారు. 


Updated Date - 2021-03-23T22:32:03+05:30 IST