కేసీఆర్ పెద్ద మోసగాడు: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-27T22:12:14+05:30 IST

దసరా దీపావళి పండగలు చేసుకోకుండా రైతులు కల్లాల దగ్గర పడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ పెద్ద మోసగాడు: కోమటిరెడ్డి

హైదరాబాద్: దసరా దీపావళి పండగలు చేసుకోకుండా రైతులు కల్లాల దగ్గర పడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పనికిరాని మంత్రులను తీసుకుని కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. మోడీ అపాయింట్ మెంట్ తీసుకోని కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లిండు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవత్వం లేదని, ధనార్జనే ఆయన ద్యేయమన్నారు. 20వేల కోట్లు పెడితే రైతుల ధాన్యం మొత్తం కొనొచ్చన్నారు. కేసీఆర్ పెద్ద మోసగాడు, కాళేశ్వరం పెద్ద గోల్ మాల్ అని విమర్శించారు. కేసీఆర్‌ది నాలుక కోసినా తప్పులేదని, దళితులకు మూడెకరాల భూమి నేనెప్పుడూ ఇస్తా అన్న అంటున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల ముఠాలా మారి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-27T22:12:14+05:30 IST