గొప్పలు చెప్పే కేసీఆర్‌కు 16వ స్థానమా?: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-06-04T05:30:00+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ

గొప్పలు చెప్పే కేసీఆర్‌కు 16వ స్థానమా?: కోమటిరెడ్డి

యాదాద్రి: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నింట్లో ముందుందని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఓ సర్వేలో 16వ స్థానంలోకి ఎలా దిగజారారని ఎద్దేవా చేశారు. గందమల్ల రిజర్వాయర్ నిర్మాణం లేదని అధికారులే చెబుతున్నారని గుర్తుచేశారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం గందమల్ల రిజర్వాయర్ ఉందంటూ.. ప్రజలను మోసం చేసిన ఆలేరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలనాటి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు ఇస్తే పూర్తవుతాయి.. కానీ వాటిని పూర్తి చేయకుండా కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ నాయకులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కరోనా టెస్టులు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా పరీక్షలు చేయటం లేదని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.


Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST