మాఫియా గుట్టు బయటపెట్టేవరకు వస్తాం: పట్టాభి

ABN , First Publish Date - 2021-10-07T23:51:36+05:30 IST

ద్వారంపూడి...కాకినాడ నీ అబ్బజాగీరుకాదని, నీ మాఫియా గుట్టు బయటపెట్టేవరకు ఎన్నిసార్లయినా వస్తామని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

మాఫియా గుట్టు బయటపెట్టేవరకు వస్తాం: పట్టాభి

అమరావతి: ద్వారంపూడి...కాకినాడ నీ అబ్బజాగీరుకాదని, నీ మాఫియా గుట్టు బయటపెట్టేవరకు ఎన్నిసార్లయినా వస్తామని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా నిన్ను ఎన్ఐఎ వదిలిపెట్టదన్నారు. డ్రగ్స్అంశంపై ఎన్ఐఏ విచారణచేపట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ద్వారంపూడి లాంటి 420లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అన్నారు. నిన్నటి టీడీపీ బృందం కాకినాడ పర్యటనలో ద్వారంపూడి ఆకు రౌడీలను ఉసిగొల్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా కార్యకలాపాల కోసం సీఎం జగన్ రెడ్డి ట్రిపుల్ ఎ ఫార్ములాను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఆఫ్రికాల మధ్య డ్రగ్స్ రవాణా చేస్తూ తమ మాఫియా సామ్రాజ్యాన్ని అంతర్జాతీయస్థాయిలో విస్తరించారని ఆరోపించారు. మత్స్యకారులను టీడీపీ ఎప్పుడూ కించపర్చదన్నారు. ద్వారంపూడి ఉచ్చులో మత్స్యకారులు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  

Updated Date - 2021-10-07T23:51:36+05:30 IST