Komuram bheem: కరెంటు తీగలు తగిలి ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-09-18T19:18:38+05:30 IST
జిల్లాలోని కాగజ్నగర్ మండలం విల్లేజ్ నంబర్ 6లో రెండు రోజుల క్రితం వన్యప్రాణుల వేట కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు.
కొమురం భీం: జిల్లాలోని కాగజ్నగర్ మండలం విల్లేజ్ నంబర్ 6లో రెండు రోజుల క్రితం వన్యప్రాణుల వేట కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి మృతికి కారణమై మృతదేహాలను పూడ్చేసిన ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వేటగాళ్ళపై నిఘా పెట్టామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ తెలిపారు.