పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలా?

ABN , First Publish Date - 2021-01-21T05:59:02+05:30 IST

పోలీసులను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌మోహనరెడ్డి రాజకీయాలు చేయొద్దని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు.

పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలా?

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ధ్వజం

మచిలీపట్నం టౌన్‌, జనవరి 20 : పోలీసులను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌మోహనరెడ్డి రాజకీయాలు చేయొద్దని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మచిలీపట్నంలోని తన ఇంటి వద్ద కొనకళ్ల నారాయణరావును బుధవారం హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులను హౌస్‌ అరెస్టులు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు.  పంచాయతీ ఎన్నికల నిలుపుదలపై కోర్టు తీర్పును గొప్పగా చెప్పుకుంటున్న పాలకులు రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదన్న హైకోర్టు తీర్పుపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొనకళ్ల హౌస్‌ అరెస్టును మాజీ కౌన్సిలర్‌ బత్తిన దాసు, నాయకులు పి.వి. ఫణికుమార్‌, యార్లగడ్డ సీతారామయ్య  ఖండించారు. 


Updated Date - 2021-01-21T05:59:02+05:30 IST