అందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్నారు: కొనకళ్ల
ABN , First Publish Date - 2022-01-21T18:34:34+05:30 IST
కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు బయట పడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు...
కృష్ణా జిల్లా: మంత్రి కొడాలి నాని నిర్వహించిన జూద క్రీడలు బయట పడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మంత్రి కొడాలి నాని ఎటువంటి సమావేశాలు పేట్టలేదన్నారు. ఇవాళ కే కన్వెన్షన్లో ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించడం, అతని భయాన్ని తెలియజేస్తుందని నారాయణరావు అన్నారు.