కొండచిలువ దాడిలో గొర్రె మృతి

ABN , First Publish Date - 2022-01-19T06:30:10+05:30 IST

పట్టణానికి సమీపంలోని ఎముకలగుట్టపల్లి రహదారి పక్కన కొం డచిలువ దాడి చే యడంతో ఓ గొర్రె మరణించింది.

కొండచిలువ దాడిలో గొర్రె మృతి

గోరంట్ల, జనవరి 18: పట్టణానికి సమీపంలోని ఎముకలగుట్టపల్లి రహదారి పక్కన  కొం డచిలువ దాడి చే యడంతో ఓ గొర్రె మరణించింది. మం గళవారం మధ్యా హ్నం ఎముకల గుట్టపల్లి సమీపంలోని కావిరాల దిన్నె వద్దకు పెద్ద హనుమంతరెడ్డి గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో గొర్రెల మందపై గుట్టలోని ఓ కొండ చిలువ దాడి చేయడంతో గొర్రెలు పరుగులు తీశాయి. కాపరి విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా.. వారు వచ్చి చేసిన అలికిడికి ఆ కొండచిలువ పొదల్లోకి వెళ్లింది. అప్పటికే గొర్రె మరణించడంతో రూ.8 వేలు నష్టం వాటిల్లినట్లు కాపరి వాపోయాడు.


Updated Date - 2022-01-19T06:30:10+05:30 IST