కోనారెడ్డి చెరువుపై పట్టింపులేని ఎమ్మెల్యే : కొండేటి
ABN , First Publish Date - 2021-06-12T05:20:54+05:30 IST
కోనారెడ్డి చెరువుపై పట్టింపులేని ఎమ్మెల్యే : కొండేటి
1234 1234 1234 1234
వర్ధన్నపేట, జూన్ 11 : కోనారెడ్డి చెరువుకు గండి పడి సంవత్సరం దగ్గరకు వస్తున్నా ఎమ్మెల్యే అరూరి రమేష్కు పట్టింపులేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఆరోపించారు. శుక్రవారం కోనారెడ్డి చెరువు, రింగ్బండ్ పరిసరా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది కూడా వర్షాలు మెరుగ్గా ఉన్నాయని, మళ్లీ నీటి ఉధృతి పెరిగితే రింగుబండ్ కూడా ఉండే అవకాశం లేదన్నారు. చెరువును మినీ ట్యాంక్బండ్గా మారుస్తానని చెప్పిన ఎమ్మెల్యే, కనీసం యథావిధిగా కూడా నిర్మాణం చేయలేదని ఎద్దేవా చేశారు. సంవత్సర కాలంగా ప్రభుత్వం శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం సిగ్గు చేట ని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కోనారెడ్డి చెరువు కు గండిపడి వందలాది ఎకరాలు దెబ్బతిన్నాయని, ఇప్పటి వరకు ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకునే ప్రభు త్వం ఎందుకు బాధితులకు పరిహారం అందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గాడిపెల్లి రాజేశ్వర్రావు, చీటూరి అశోక్, పిట్టల రాజు, కుందూరు మహేందర్రెడ్డి, గోధుమల మధుసూదన్, కొండేటి సత్యం, రాయపురపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.