రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-07-26T09:57:34+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు


కాగజ్‌నగర్‌ రూరల్‌, జూలై25: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని చింతగూడ, నజ్రూల్‌నగర్‌, విలేజ్‌నం.5 గ్రామాల్లో శనివారం రైతు వేదికల నిర్మాణాలకు ఆయన భూమిపూజ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలతో రైతులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు. రైతులకు ఈ వేదికల ద్వారా ఎరువులు అందించడంతో పాటు పంటల సాగు కోసం సలహాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీపురుశెట్టి శంకర్‌, సర్పంచ్‌లు శంకర్‌, దలైపూల్‌, ఎంపీటీసీలు కుమార్‌, అమిత్‌, పంచాయతీరాజ్‌ జేఈ రాజ్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఏఈఓలు పజీరోద్దీన్‌, యువరాణి, మండల రైతు బంధు అధ్యక్షుడు రాజన్న, కో ఆప్షన్‌ సభ్యుడు సిద్దిక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-26T09:57:34+05:30 IST