రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2020-07-26T09:57:34+05:30 IST
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు.
జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు
కాగజ్నగర్ రూరల్, జూలై25: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. కాగజ్నగర్ మండలంలోని చింతగూడ, నజ్రూల్నగర్, విలేజ్నం.5 గ్రామాల్లో శనివారం రైతు వేదికల నిర్మాణాలకు ఆయన భూమిపూజ నిర్వహిం చారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలతో రైతులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు. రైతులకు ఈ వేదికల ద్వారా ఎరువులు అందించడంతో పాటు పంటల సాగు కోసం సలహాలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీపురుశెట్టి శంకర్, సర్పంచ్లు శంకర్, దలైపూల్, ఎంపీటీసీలు కుమార్, అమిత్, పంచాయతీరాజ్ జేఈ రాజ్కుమార్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఏఈఓలు పజీరోద్దీన్, యువరాణి, మండల రైతు బంధు అధ్యక్షుడు రాజన్న, కో ఆప్షన్ సభ్యుడు సిద్దిక్ పాల్గొన్నారు.