ఎర్రకాలువ జలాశయం మెరక చేశారు

ABN , First Publish Date - 2021-06-15T05:07:55+05:30 IST

కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో 10 ఎకరాల వరకు పల్లపు ప్రాంతాన్ని మెరక చేయడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతుందని, ఈచర్యలను వెంటనే నిలుపుదల చేయాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎర్రకాలువ జలాశయం మెరక చేశారు
ఇరిగేషన్‌ అధికారులకు వినతిపత్రం ఇస్తున్న సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు

జంగారెడ్డిగూడెం, జూన్‌ 14: కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో 10 ఎకరాల వరకు పల్లపు ప్రాంతాన్ని మెరక చేయడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతుందని, ఈచర్యలను వెంటనే నిలుపుదల చేయాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ఇరిగేషన్‌ అధికారులకు సోమవారం వినతిపత్రం అందజేశారు. జలాశయం భూముల్లో పల్లపు ప్రాంతంలో 10 ఎకరాలను యంత్రాల సహాయంతో మట్టి తవ్వి మెరక చేస్తున్నారన్నారు. నిలుపుదల చేయక పోతే భవిష్యత్‌లో జలా శయ నీటి నిల్వ తగ్గిపోతుందన్నారు. తలారి ప్రకాష్‌, కె.సుందరరావు, రాంబా బు, సీహెచ్‌ ధరమ్మయ్య, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:07:55+05:30 IST