దళిత సర్పంచ్నని అవమానిస్తారా!
ABN , First Publish Date - 2021-06-24T06:50:06+05:30 IST
కోరుకొల్లు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గదికి వైసీపీ నేతల అండదండలతో ఉప సర్పంచ్ సీహెచ్.నాగరాజు, 5వ వార్డు సభ్యుడితో కలిసి అన్యాయంగా తాళం వేశారని నిరసిస్తూ బుధవారం కార్యాలయం ఎదుట సర్పంచ్ బట్టు లీలాకనకదుర్గ ధర్నా నిర్వహించారు.
కోరుకొల్లు సర్పంచ్ నిరసన దీక్ష
కలిదిండి, జూన్ 23: కోరుకొల్లు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గదికి వైసీపీ నేతల అండదండలతో ఉప సర్పంచ్ సీహెచ్.నాగరాజు, 5వ వార్డు సభ్యుడితో కలిసి అన్యాయంగా తాళం వేశారని నిరసిస్తూ బుధవారం కార్యాలయం ఎదుట సర్పంచ్ బట్టు లీలాకనకదుర్గ ధర్నా నిర్వహించారు. పోలీసులు, పంచాయతీ కార్యదర్శి రంగ ప్రవేశం చేసి సర్పంచ్ గదికి వేసిన తాళం తీయించారు. దళిత మహిళా సర్పంచ్ని కాబట్టే తనను ఈ విధంగా అవమాన పరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గదికి తాళం వేసినవారు తర్వాత తనను గదిలో పెట్టి తాళం వేస్తారని, తన భర్తతోపాటు ఏడుగురు వార్డులు, జనసేన కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్ష కొనసాగించారు. తన చెక్పవర్ను తీసివేసేందుకు కూడా కుట్ర జరుగుతోందని దీనిపై అధికారులు, పాలకులు హామీ ఇచ్చేవరకు దీక్ష విరమించేది లేదని పేర్కొంది.