కొత్తపల్లి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన కారే
ABN , First Publish Date - 2021-10-15T05:21:24+05:30 IST
కొత్తపల్లి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా కారే సుధాశ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు.
కొత్తపల్లి, అక్టోబరు 14: కొత్తపల్లి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా కారే సుధాశ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎం పీడీవో పి.వసంతమాధవి, సిబ్బంది బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ సుధాశ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ మండలాధ్యక్షుడు ఆనాల సుదర్శన్, వైసీపీ రాష్ట్ర నాయకులు రావు చిన్నారావు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.