మంత్రి తలసానిని కలిసిన కౌశిక్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-23T21:21:25+05:30 IST
గత మూడురోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరిన హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి శుక్రవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో
హైదరాబాద్: గత మూడురోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరిన హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి శుక్రవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఆయనను అభినందించారు. అనంతరం కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసందర్భంగా మంత్రి తలసానిని కలిసిన వారిలోఎమ్మెల్యేలు దానం నాగేందర్, బిగాల గణేష్ గుప్తా లు కూడా ఉన్నారు.