చంద్రయ్య కుటుంబానికి అండ
ABN , First Publish Date - 2022-01-25T05:19:40+05:30 IST
రాష్ట్రంలో జరగుతున్న ఫ్యాక్షన హత్యలకు సీఎం జగన్మోహనరెడ్డితో పాటు, డీజీపీ సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు డిమాండ్ చేశారు.
కోవెలమూడి మిత్రమండలి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
గుంటూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగుతున్న ఫ్యాక్షన హత్యలకు సీఎం జగన్మోహనరెడ్డితో పాటు, డీజీపీ సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, జూలకంటి బ్రహ్మానందరెడ్డిలు డిమాండ్ చేశారు. ఇటీవల హత్యకు గురైన మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామపార్టీ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య కుటుంబానికి కోవెలమూడి రవీంద్ర మిత్రమండలి అండగా నిలిచింది. ఎన్నారై టీడీపీ (డల్లాస్) కు చెందిన చింతమనేని సుధీర్, సూరపనేని నిఖిల్లు చంద్రయ్య కుటుంబానికి రూ.6లక్షల60వేల ఆర్ధిక సాయాన్ని అందించారు. అమొత్తాన్ని కోవెలమూడి రవీంద్ర సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో మాచర్ల ఇనఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అధికారం, పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన లీడర్లపై కచ్చితంగా చర్యలుంటాయని తెలిపారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టినవారు ఎంతో మంది కాలగర్భంలో కలసిపోయారన్న విషయం వైసీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.