మీడియాకు కొవిడ్ కాటు
ABN , First Publish Date - 2020-10-01T06:32:20+05:30 IST
దేశీయ మీడియా, వినోద రంగాల్ని కరోనా కోలుకోలేనంద దెబ్బ తీసింది...
న్యూఢిల్లీ: దేశీయ మీడియా, వినోద రంగాల్ని కరోనా కోలుకోలేనంద దెబ్బ తీసింది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరం రూ.1,75,100 కోట్లున్న ఈ రంగం ఆదాయం ఈ ఆర్థిక సంవత్స,రం (2020-21) 20 శాతం తగ్గి రూ.1,40,200 కోట్లకు పడిపోనున్నట్టు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికలో తెలిపింది. అయితే వచ్చేఆర్థిక సంవత్సరం (2021-22) ఈ రంగం కోలుకుని 33 శాతం వృద్ధి రేటుతో రూ.1,86,600 కోట్ల ఆదాయం నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. డిజిటలీకరణ, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తాయని తెలిపింది.
నివేదిక ఇతర ప్రధాన అంశాలు
- 2028 నాటికి 100 కోట్లకు డిజిటల్ మీడియా వినియోగదారులు.
- లాక్డౌన్తో వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు.
- కంటెంట్ నుంచి పంపిణీ వరకు పెరిగిన డిజిటల్ టెక్నాలజీ వినియోగం.
- డిజిటల్ నైపుణ్యాలు అలవర్చుకోవడంలో తప్పని సవాళ్లు.
- డిజిటల్ టెక్నాలజీతో కలిసొస్తున్న ఖర్చులు, సమయం.
- టీవీ మీడియాను మించనున్న డిజిటల్ మీడియా ప్రకటనలు, ప్రచార ఆదాయం.
- ఆదాయ పరంగా పుంజుకున్న ఓటీటీ యాప్లు.
- తగ్గుతున్న ప్రింట్, రేడియో, టీవీ మీడియాల ప్రభావం.