భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం

ABN , First Publish Date - 2020-07-13T17:55:12+05:30 IST

భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.

భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 28,701 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 500 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు 9 లక్షలకు చేరువవుతున్నాయి. సోమవారం ఉదయం నాటికి 8,74,254కు కేసులు పెరిగాయి. మృతుల సంఖ్య 23,174కు చేరింది. వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతవరకు 5,53,471 మంది డిశ్చార్జ్ అయ్యారు. 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

Updated Date - 2020-07-13T17:55:12+05:30 IST