కేజీబీవీల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి: ఏపీసీ

ABN , First Publish Date - 2022-01-26T05:58:55+05:30 IST

ప్రస్తుతం కేజీబీవీల్లో కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయని... ముందస్తు జాగ్రత్తలతో పాటు, విద్యార్థుల ఆరోగ్య సంర క్షణ చర్యలు అన్నీ తీసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌ పేర్కొన్నారు.

కేజీబీవీల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి: ఏపీసీ
మాట్లాడుతున్న ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌

అనంతపురం విద్య, జనవరి 25 :  ప్రస్తుతం కేజీబీవీల్లో కోవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయని... ముందస్తు జాగ్రత్తలతో పాటు, విద్యార్థుల ఆరోగ్య సంర క్షణ చర్యలు అన్నీ తీసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌ పేర్కొన్నారు. ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని సైన్స్‌సెంటర్‌లో  కేజీబీవీ ప్రిన్సిపా ళ్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ....కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో అంద రూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తలు తీసుకోవ డంతో పాటు చదువులపై దృష్టి పెట్టాలన్నారు. ఒక వేళ లాన్‌డౌన్‌, ఇతర పరిస్థితు లు వస్తే... సిలబస్‌ పూర్తి కాకుంటే విద్యార్థులు ఇ బ్బందులు పడుతారని, గడువులోగా  సిలబస్‌ పూ ర్తిచేయాలన్నారు. అలాగే కేజీబీవీల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. ఫుడ్‌ సేప్టీ కమిటీ పర్యవేక్షణ ఉంటుందన్నారు.  మెనూ తప్పితే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. తర్వాత అకౌంట్స్‌, రికార్డ్స్‌ అప్‌డేట్‌, ఉద్యోగుల సమయపాలన తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.  కార్యక్రమంలో జీసీడీఓ రెబెకా, అసిస్టెంట్‌ జీసీడీఓ కవిత, ఇతర ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-26T05:58:55+05:30 IST