కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే

ABN , First Publish Date - 2022-01-22T05:01:19+05:30 IST

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిదేనని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం మండలపరిధిలోని పేర్నమిట్టలోని జడ్పీహైస్కూ ల్‌ను ఆయన ఆకస్మింగా తనిఖీ చేసి విద్యార్థుల తో మాట్లాడారు.

కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే
విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ 


సంతనూతలపాడు, జనవరి 21: పాఠశాలల్లో కొవిడ్‌  నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిదేనని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం మండలపరిధిలోని పేర్నమిట్టలోని జడ్పీహైస్కూ ల్‌ను ఆయన ఆకస్మింగా తనిఖీ చేసి విద్యార్థుల తో మాట్లాడారు. తరగతి గదుల్లో ఫర్నిఛర్‌ లేక పోవడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మా స్కు లేని విద్యార్థులను గుర్తించి వారికి తగు జా గ్రత్తలను సూచించాలని హెచ్చరించారు. టెన్త్‌ వి ద్యార్థులు స్కూలులో ఎంతమంది భోజనం చేస్తు న్నారని ప్రశ్నించారు. 54 మందికిగాను 9మంది మాత్రమే భోజనం చేస్తున్నారని ఉపాధ్యాయులు చెప్పగా భోజనం సక్రమంగా ఉంటే ఇళ్లకు ఎం దుకు వెళతారని మండిపడ్డారు. మండలంలో ఎం తమంది విద్యార్థులు పాఠశాలల్లో కాకుండా ఇళ్ల కు వెళ్లి భోజనం చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని ఎంఈవో ఆంజనేయులను ఆదేశించారు. జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే స్కూలుకు రావ ద్ద ని సూచించారు. అమ్మఒడి రావడం లేదని ఓ వి ద్యార్థి తల్లి కలెక్టర్‌ను అడగ్గా వెంటనే ఫోన్‌లో డీఈవోతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.రామానాయుడు, ఎంపీడీవో ఎం.రమణరావు, హెచ్‌ఎం ప్రమోద త దితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T05:01:19+05:30 IST