పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2020-11-26T05:25:30+05:30 IST
పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎంపీడీవో పి.మురళీమోహన్కుమార్ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు
సరుబుజ్జిలి:పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎంపీడీవో పి.మురళీమోహన్కుమార్ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన విద్యార్థులంతా మాస్కులు ధరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం జగనన్న గోరుముద్దపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఫపొందూరు: పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించి తరగతులు నిర్వహించాలని జిల్లా పరిశీలకులు, డైట్ లెక్చరర్ పాత్రుని రమణమూర్తి సూచించారు. బుధవారం పిల్లలవలస జడ్పీ ఉన్నత పాఠశాల, బి.కంచరాం యూపీ పాఠశాలలను పరిశీలించారు. జగనన్న విద్యాకానుక వారోత్సవాలతోపాటు పలు పఽథకాల అమలుతీరును పరిశీలించారు.