పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-11-26T05:25:30+05:30 IST

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
రొట్టవలసలో విద్యార్థులకు సూచనలిస్తున్న ఎంపీడీవో మురళీమోహన్‌కుమార్

సరుబుజ్జిలి:పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు  పాటించాలని ఎంపీడీవో  పి.మురళీమోహన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన విద్యార్థులంతా మాస్కులు  ధరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం జగనన్న గోరుముద్దపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఫపొందూరు: పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించి తరగతులు నిర్వహించాలని జిల్లా పరిశీలకులు, డైట్‌ లెక్చరర్‌ పాత్రుని రమణమూర్తి సూచించారు. బుధవారం   పిల్లలవలస జడ్పీ ఉన్నత పాఠశాల, బి.కంచరాం యూపీ పాఠశాలలను పరిశీలించారు. జగనన్న విద్యాకానుక వారోత్సవాలతోపాటు పలు  పఽథకాల అమలుతీరును పరిశీలించారు.



Updated Date - 2020-11-26T05:25:30+05:30 IST