వ్యాక్సిన్పై అపోహలు వద్దు : డీఎస్పీ
ABN , First Publish Date - 2021-02-25T04:51:02+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాఽథ్ అన్నారు. కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు.
కొవ్వూరు, ఫిబ్రవరి 24 : కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాఽథ్ అన్నారు. కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ ఈనెల 27 వరకు పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తారని, వ్యాక్సిన్ పట్ల అపోహలు తొలగించేందుకు ముందుగా వేయించుకుని భరోసా కల్పిస్తున్నామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో ఎం.ధర్మరాజు, డాక్టర్ బి.శ్రీనివాస్ పర్యవేక్షించారు.