కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో వ్యక్తిపై హత్యాయత్నం
ABN , First Publish Date - 2020-08-15T22:53:00+05:30 IST
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో సమీర్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోహిల్, ఆసిఫ్, అస్లమ్
హైదరాబాద్: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో సమీర్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోహిల్, ఆసిఫ్, అస్లమ్ అనే దుండగులు సమీర్ను తమ ఆటోలో ఎక్కించుకుని కత్తులతో పొడిచారు. దీనిని ఓ వ్యక్తి గమనించటంతో దుండగులు సమీర్ను ఆటో నుండి తోసేసి పారిపోయారు. ఓ యువతితో సమీర్ అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.