క్రెబ్స్‌ బయోపై దివాలా ప్రక్రియ

ABN , First Publish Date - 2020-05-28T08:53:07+05:30 IST

క్రెబ్స్‌ బయోపై దివాలా ప్రక్రియ

క్రెబ్స్‌ బయోపై దివాలా ప్రక్రియ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): క్రెబ్స్‌ బయోపై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అమరావతి బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. నిర్వహణ రుణం తిరిగి చెల్లించడంలో క్రెబ్స్‌ బయో విఫలమైందని ఆరోపించిన ఆర్‌ ఆర్‌ ఇన్నోవేటివ్‌ దివాలా స్మృతి సెక్షన్‌ 9 కింద కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) చేపట్టాలని పిటిషన్‌ వేసింది. అందుకు స్పందించిన ఎన్‌సీఎల్‌టీ బెంచి ఆర్‌ఆర్‌ ఇనోవేటివ్‌కు రూ.20 లక్షల బకాయిలు, దానిపై రూ.7.92 లక్షల వడ్డీ చెల్లింపులో విఫలమైనందుకు దివాలా ప్రక్రియ చేపట్టాలని ఆదేశం జారీ చేస్తూ రాజేష్‌ ఛపరియాను మధ్యంతర రిసొల్యూషన్‌ నిపుణుడిగా నియమించింది. 

Updated Date - 2020-05-28T08:53:07+05:30 IST