కృష్ణాజిల్లాలో విషాదం..చెరువులో పడి అన్నదమ్ములు మృతి

ABN , First Publish Date - 2020-05-31T17:25:18+05:30 IST

జిల్లాలోని గుడివాడ మందపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తట్టివర్రు చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.

కృష్ణాజిల్లాలో విషాదం..చెరువులో పడి అన్నదమ్ములు మృతి

కృష్ణా: జిల్లాలోని గుడివాడ మందపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తట్టివర్రు చెరువులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు..హర్ష (19), ప్రేమ్‌ (21) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నాదమ్ములు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2020-05-31T17:25:18+05:30 IST