ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ...ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-09-26T14:11:01+05:30 IST

జిల్లాలోని చల్లపల్లి మండలం యార్లగడ్ద గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ...ఒకరు మృతి

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం యార్లగడ్ద గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా...ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు పల్లికొండ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేశారు. దాడులకు తెగబడిన రెండు కుటుంబాలూ సోదర కుటుంబాలేనని  సీఐ వెంకట నారాయణ తెలిపారు. 

Updated Date - 2020-09-26T14:11:01+05:30 IST