నూజివీడు పురపోరులో విపక్ష అభ్యర్థులకు అధికారపక్షం ఎర
ABN , First Publish Date - 2021-03-03T13:49:08+05:30 IST
నూజివీడు మున్సిపల్ ఎన్నికల్ల విపక్షాల అభ్యర్థులకు ఎరవేసేందుకు అధికారపక్షం ప్రయత్నం చేపట్టింది. నూజివీడు పురపాలక సంఘంలోని 32 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయ్యింది.
కృష్ణా: నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులకు ఎరవేసేందుకు అధికారపక్షం ప్రయత్నాలు చేపట్టింది. నూజివీడు పురపాలక సంఘంలోని 32 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయ్యింది. 30వ వార్డులో టీడీపీ నుండి చిట్టిమోతు నాగేశ్వరావు నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవడంతో వైసీపీ అభ్యర్థి గిరీష్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సమన్వయలేమి, నాయకత్వలోపంతో అభ్యర్థులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు క్రియాశీలంగా వ్యవహిరించకపోవడంతో ఉపసంహరణల దిశగా మరికొంతమంది టీడీపీ అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం.