చెరువులో దూకిన యువకుడు..రక్షించడానికి వెళ్లిన ఇద్దరు గల్లంతు

ABN , First Publish Date - 2021-09-02T14:15:15+05:30 IST

కృష్ణా జిల్లాలోని కొండూరు మండలం ముత్యాలంపాడులో విషాదం చోటు చేసుకుంది. ఒకరిని కాపాడబోయి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు

చెరువులో దూకిన యువకుడు..రక్షించడానికి వెళ్లిన ఇద్దరు గల్లంతు

కృష్ఱా: కృష్ణా జిల్లాలోని కొండూరు మండలం ముత్యాలంపాడులో విషాదం చోటు చేసుకుంది. ఒకరిని కాపాడబోయి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు ప్రవీణ్ చెరువులో దూకాడు. ప్రవీణ్ వెంట ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ రక్షించడానికి ఈత రాకున్నా చెరువులో దూకారు. అయితే.. చెరువులో దూకిన ప్రవీణ్‎కు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రవీణ్ కోసం చెరువులో దూకిన ఇద్దరు గల్లంతయ్యారు. చెరువులో కోటేశ్వరరావు మృతదేహం లభ్యం కాగా, చిన్న మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలఫిస్తున్నారు.

Updated Date - 2021-09-02T14:15:15+05:30 IST