గుడివాడ: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-09-15T16:56:07+05:30 IST

కృష్ణా జిల్లా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

గుడివాడ: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

కృష్ణా జిల్లా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో డెలివరీకి వచ్చిన గుడివాడకు చెందిన పిల్లి నాగ  మౌనికకు సరైన చికిత్స చేయకపోవడంతో, గర్భంలోనే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల తీరుపై నిరసనగా ఆస్పత్రి అద్దాలు పగులగొట్టారు. దీనిపై డాక్టర్ మాధురి మాట్లాడుతూ పరిస్థితి విషమించిన తర్వాత గర్భిణీని ఆస్పత్రికి తీసుకు వచ్చారని, తాము  ప్రాథమిక వైద్యం చేశామని తెలిపారు. నెలలు నిండకుండా నొప్పులు రావడం, బ్లడ్ బ్లీడింగ్‌తో గర్భంలో బేబీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా గర్భిణీ కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై, తమపై దాడి చేశారని డాక్టర్ మాధురి అన్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-09-15T16:56:07+05:30 IST