ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా పేర్నినాని కుమారుడు కిట్టు

ABN , First Publish Date - 2021-10-27T17:42:13+05:30 IST

కృష్ణాజిల్లా: ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని తనయుడు అతిథిగా హాజరుకావడం...

ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా పేర్నినాని కుమారుడు కిట్టు

కృష్ణాజిల్లా: ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి పేర్నినాని తనయుడు అతిథిగా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం ఆర్టీసీ డీపో డ్రైవింగ్ స్కూల్లో 9వ బ్యాచ్ శిక్షణాతరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మంత్రి తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) హాజరయ్యారు. ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ ఎంవై దానం అతిథిగా హాజరుకావాల్సి ఉండగా ఆయన రాకపోవడంతో కిట్టును ఆహ్వానించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


గతంలో మచిలీపట్నం కార్పొరేషన్ అధికారుల సమీక్షకు కూడా కిట్టు హాజరయ్యారు. కాగా అధికారిక కార్యక్రమాలకు మంత్రి పేర్ని నాని తన కుమారుడిని పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-10-27T17:42:13+05:30 IST