అక్కడ రీ కౌంటింగ్‌కు ఎమ్మెల్యే ఉదయభాను డిమాండ్

ABN , First Publish Date - 2021-11-17T18:40:32+05:30 IST

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అక్కడ రీ కౌంటింగ్‌కు ఎమ్మెల్యే ఉదయభాను డిమాండ్

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడం వివాదం రేపింది. కౌంటింగ్ సెంటర్‌లో గలాటా సృష్టించేందుకు ఎమ్మెల్యే వచ్చారని కలెక్టర్, ఎస్పీలకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మెజారిటీ వార్డులు తమకు వస్తుండడంతోనే ఆయన కౌంటింగ్ సెంటర్‌కు వచ్చారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 13వ వార్డులో టీడీపీకి మెజారిటీ వచ్చింది. దీంతో రీ కౌంటింగ్‌కు ఎమ్మెల్యే ఉదయభాను డిమాండ్ చేశారు. ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. టీడీపీ ఏజెంట్లను బెదిరించే ధోరణిలో ఎమ్మెల్యే వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. మొత్తం 31 వార్డులకు గాను ఒంటి గంట సమయంలో 16 వార్డులకు కౌంటింగ్ పూర్తయింది. టీడీపీ, వైసీపీ చెరిసగం గెలుచుకున్నాయి.

Updated Date - 2021-11-17T18:40:32+05:30 IST