కొండపల్లిలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

ABN , First Publish Date - 2021-11-24T16:36:15+05:30 IST

కృష్ణాజిల్లా: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక బుధవారం జరగనుంది.

కొండపల్లిలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

కృష్ణాజిల్లా: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక బుధవారం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. గట్టి పోలీసుల భద్రత మధ్య టీడీపీ వార్డు సభ్యులను ఎంపీ కేశినేని నాని మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వార్డు సభ్యుల బస్సులో వస్తున్న మీడియా సిబ్బందిని  పోలీసులు మార్గ మధ్యలో దించివేశారు. మొత్తంగా చూస్తే కొండపల్లి పోలీసుల వలయంలో ఉంది. టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పేరుతో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీడియా కవరేజ్‌ను అడ్డుకుంటున్నారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు.

Updated Date - 2021-11-24T16:36:15+05:30 IST