Krishna: కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన ఇన్నోవా

ABN , First Publish Date - 2021-09-18T12:41:49+05:30 IST

కృష్ణా జిల్లాలోని కేఈబీ కెనాల్‌లోకి ఇన్నోవా వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆ వ్యక్తిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు

Krishna: కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన ఇన్నోవా

కృష్ణా: కృష్ణా జిల్లాలోని కేఈబీ కెనాల్‌లోకి ఇన్నోవా వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆ వ్యక్తిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మరొ ముగ్గురు సురక్షితంగా భయటపడ్డారు. ఈ ఘటన మోపిదేవి మండలం కొత్తపాలెం సమీంపలో చోటు చేసుకుంది. కృష్ణా కరకట్ట పైనుంచి అవనిగడ్డ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-09-18T12:41:49+05:30 IST