Krishna: స్కూటీని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-08T12:52:56+05:30 IST

గూడవల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..

Krishna: స్కూటీని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..వ్యక్తి మృతి

కృష్ణా: గూడవల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆటోలో గాయాలైన వ్యక్తిని గన్నవరం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి గన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-08T12:52:56+05:30 IST