కృష్ణా జలాలపై తెలంగాణ వాదనలో పసలేదు

ABN , First Publish Date - 2021-08-01T08:50:21+05:30 IST

నదీ పరీవాహక ప్రాంతంకాని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలను ఇచ్చేందుకు కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌ అంగీకరించదని, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా సీమకు నీళ్లు వదిలేందుకు వీల్లేదని, కృష్ణాజలాల్లో

కృష్ణా జలాలపై తెలంగాణ వాదనలో పసలేదు

రాష్ట్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి

నవ్యాంధ్ర రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం విజ్ఞప్తి


అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): నదీ పరీవాహక ప్రాంతంకాని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలను ఇచ్చేందుకు కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌ అంగీకరించదని, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా సీమకు నీళ్లు వదిలేందుకు వీల్లేదని, కృష్ణాజలాల్లో సగం వాటా తెలంగాణకు దక్కుతుందంటూ కృష్ణానదీ యాజమాన్య సంస్థకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇచ్చిన సమాచారంలో వాస్తవంలేదని నవ్యాంధ్ర రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల సంఘం పేర్కొంది. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ తప్పులేనని, ఈ వాదనలో పసలేదని ఆ సంఘం అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు ఆక్షేపించారు. కొత్త ట్రైబ్యునల్‌ ఆదేశాలు వచ్చేంత వరకూ కృష్ణాజలాల్లో 50 శాతం కోటాను ఇవ్వాల్సిందేనని తెలంగాణ కోరడం అర్థరహితమన్నారు. కృష్ణానదీ జల వివాద ట్రైబ్యునల్‌-2 రాజోలిబండ కుడి కాలువకు 4టీఎంసీలను కేటాయించడంతో సహా పనులు ముందుకు తీసుకువెళ్లవచ్చని సూచించడాన్ని గుర్తుచేశారు. సాధారణ ప్రవాహంలో తెలుగుగంగకు పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 25 టీఎంసీలను కేటాయించిందని స్పష్టం చేశారు. 2015 జూన్‌ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి కార్యాలయంలో ఇరురాష్ట్రాల జలవనరుల మంత్రుల సమక్షంలో ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ఒప్పందం చేసుకున్నారన్నారు. కేఆర్‌ఎంబీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-08-01T08:50:21+05:30 IST