పాతబస్తీకి ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసింది: కేటీఆర్

ABN , First Publish Date - 2021-10-04T23:24:42+05:30 IST

పాతబస్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.

పాతబస్తీకి ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసింది: కేటీఆర్

హైదరాబాద్: పాతబస్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం లాంటివి ఓల్డ్ సిటీలోనే ఉన్నాయన్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అని కాకుండా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేలా చూస్తామని చెప్పారు. పాతబస్తీలో రోడ్‌ వైడెనింగ్‌ పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 400 కోట్లను కేటాయించామన్నారు. పాతబస్తీకీ మెట్రో విస్తరించడం సరైందే, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీకి మెట్రోరైలు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-04T23:24:42+05:30 IST