నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ

ABN , First Publish Date - 2021-06-18T01:52:25+05:30 IST

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాది

నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాది కావస్తున్నా ప్రయోజనం లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలకు సంబంధించిన గ్యారెంటెడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీంకు మార్గదర్శకాలు వెలువడలేదని లేఖలో కేటీఆర్ తెలిపారు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి రూ. 20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికి ఏడాది కావస్తోందని తెలిపారు. తెలంగాణలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నామని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T01:52:25+05:30 IST