మహబూబాబాద్ కలెక్టర్కు కేటీఆర్ అభినందన
ABN , First Publish Date - 2020-04-09T09:36:58+05:30 IST
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈనెల 27న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీమ్సాగర్, డీఎంఅండ్హెచ్వో శ్రీరామ్లతో కలెక్టర్ గౌతమ్
మహబూబాబాద్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈనెల 27న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీమ్సాగర్, డీఎంఅండ్హెచ్వో శ్రీరామ్లతో కలెక్టర్ గౌతమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్త నిల్వలు లేవని ఆయన దృష్టికి వైద్యాధికారులు తీసుకురావడంతో వెంటనే స్పందించి మంగళవారం సాయంత్రం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా తానే రక్తదానం చేశారు. దీన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ కలెక్టర్ స్వయంగా రక్తదానం చేయడాన్ని అభినందించారు.