నేడు కొత్తూరుకు మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-04-14T05:10:44+05:30 IST

నేడు కొత్తూరుకు మంత్రి కేటీఆర్‌

నేడు కొత్తూరుకు మంత్రి కేటీఆర్‌

  • రూ.5కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

కొత్తూర్‌: మంత్రి కేటీఆర్‌ బుధవారం కొత్తూర్‌కు రానున్నారు. నూతనంగా ఏర్పడిన కొత్తూర్‌ మున్సిపాలిటీలో రూ.3.5కోట్లతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి మంత్రి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి శంఖుస్థాపన చేయనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పాపిరస్‌ పోర్టు రిసార్టు సమీపంలో ఉన్న రెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీ భవనం కోసం ఇదివరకే కేటాయించారు. రూ.1.5కోట్లతోచేపట్టనున్న వై-జంక్షన్‌ నుంచి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వరకు రోడ్డు డివైడర్‌, లైటింగ్‌ పనులకు మంత్రి శంఖుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పర్యవేక్షించారు. 


  • కేటీఆర్‌ సభను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే


మంత్రి కేటీఆర్‌ సభను సక్సెస్‌ చేయాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని శ్రీలక్ష్మీ బాంకెట్‌హాల్‌లో మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొ త్తూర్‌ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్‌ బుధవారం వస్తున్నారని తెలిపారు. కొత్తూర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ ప్రజలనుద్ధేశించి మాట్లాడుతారని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైౖర్మన్‌ గణేష్‌, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వి.నారాయణరెడ్డి, యాదగిరి, ఎమ్మె సత్యనారాయణ, దేవేందర్‌యాదవ్‌, జెనిగె జగన్‌, కమ్మరి జనార్ధన్‌చారి, కోస్గి శ్రీనివాస్‌, రాజేందర్‌గౌడ్‌, డోలీ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T05:10:44+05:30 IST