బోడుప్పల్లో వరద బాధితులను పరామర్శించిన కేటీఆర్
ABN , First Publish Date - 2020-10-22T00:01:50+05:30 IST
భారీ వర్షాలకు జలమయమైన బోడుప్పల్, రామంతాపూర్లోని నేతాజీ నగర్లో మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి పర్యటించారు.
హైదరాబాద్: భారీ వర్షాలకు జలమయమైన బోడుప్పల్, రామంతాపూర్లోని నేతాజీ నగర్లో మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణసాయంగా 10వేల రూపాయలు అందజేశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బోడుప్పల్లోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో వరద బాధితులకు ఏర్పాటుచేసిన భోజన ఏర్పాట్లను కూడా కేటీఆర్ పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి వెంట ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, బోడుప్పల్ మేయర్ సమల బుచ్చిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.