పెళ్లికి నిరాకరించిందనే కోపంతో.. వివాహితను..

ABN , First Publish Date - 2020-08-02T13:41:38+05:30 IST

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో వివాహితను..

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో.. వివాహితను..

వివాహిత హత్య

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో దారుణానికి ఒడిగట్టిన యువకుడు


ఈపూరు(గుంటూరు): పెళ్లికి నిరాకరించిందనే కోపంతో వివాహితను కత్తితో గొంతుకోసి హత్య చేసిన ఘటన మండలంలోని కూచినపల్లిలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులో నివాసం ఉండే ఆలా సుబ్బారావు, శ్యామల కుమార్డె తేజశ్రీ(21)కి గుంటూరుకే చెందిన సింగంశెట్టి ప్రవీణ్‌కు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాదికే భార్యాభర్తలు విడిపోయారు. తేజశ్రీ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. 


తేజశ్రీకి సమీప బంధువైన దుర్గాప్రసాదు ఆమెను వివాహం చేసుకుంటానని సుబ్బారావును అడిగాడు. కానీ తేజశ్రీకి ఇష్టం లేదు. ఆమె కూచినపల్లిలోని తాతయ్య పెదవెంకటేశ్వర్లు ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చింది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్దకు వచ్చిన దుర్గాప్రసాదు కత్తితో విచక్షణారహితంగా తేజశ్రీ గొంతు కోశాడు. తాత బయటకు వచ్చి చూడగా తేజశ్రీ మృతి చెంది ఉంది. ఘటనా స్థలాన్ని వినుకొండ రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సింగయ్య సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాదు పోలీసులకు లొంగిపోయాడు. 


Updated Date - 2020-08-02T13:41:38+05:30 IST