కూకట్‌పల్లి సర్కిల్ క్లీన్ స్వీప్.. గులాబీ మయం

ABN , First Publish Date - 2020-12-04T23:07:55+05:30 IST

కూకట్‌పల్లి సర్కిల్‌ను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆరుకు ఆరు డివిజన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. 119 డివిజన్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహా యాదవ్ గెలుపొందారు.

కూకట్‌పల్లి సర్కిల్ క్లీన్ స్వీప్.. గులాబీ మయం

హైదరాబాద్: కూకట్‌పల్లి సర్కిల్‌ను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆరుకు ఆరు డివిజన్లను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. 119 డివిజన్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దం నర్సింహా యాదవ్ గెలుపొందారు. 120 డివిజన్ బాలానగర్‌లో ఆవుల రవీందర్ రెడ్డి 3748 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 121 డివిజన్‌ కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ 749 ఓట్లతో, 122వ డివిజన్ వివేకానంద నగర్‌లో మాధవరం రోజా రంగారావు, 123వ డివిజన్ హైదర్ నగర్‌లో నార్నే శ్రీనివాస్ రావు 2010 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 124వ డివిజన్ ఆల్విన్ కాలనీలో దొడ్ల వెంకటేష్ గౌడ్ 1208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

Updated Date - 2020-12-04T23:07:55+05:30 IST